తమిళనాడులో వారిద్దరూ తిరుగులేని నటులు. ఒకరు మాస్ మెచ్చిన సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీ కాంత్ అయితే... మరొకరు క్లాస్ ఆడియెన్స్ మనసు దోచిన విశ్వ నాయకుడు, మహా నటుడు కమల్ హాసన్. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత ఏర్పడిన రాజకియ శూన్యత లో ముందుగా స్పందించి రాజకియ రంగ ప్రవేశం చేయనున్నట్టు ప్రకటించాడు కమల్ హాసన్. దానికి ప్రణాళిక కూడా రచించాడు. ఈ లోగా చేతిలో ఉన్న సినిమాలు శభాష్ నాయుడు, విశ్వరూపం-2 పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇదిలా ఉండగా ఆయన సహచరుడు, అనుంగు మిత్రుడు రజనీ కాంత్ ఒక అడుగు ముందుకేసి రాజకీయ పార్టీని అనౌన్స్ చేసేసాడు. దీనిపై కమల్ తన ట్విట్టర్ లో స్పందిస్తూ వెల్కమ్ ... రజనీ వెల్కమ్.. వెల్కమ్ అని వ్యాఖ్యానించడం గమనార్హం. ఏదయినా ఇద్దరూ అవినీతి పైనే మా పోరాటం అంటున్నారు కాబట్టి ఇద్దరు కలసి ఒకే పార్టీ పెడితే ఇంకా బాగుంటుంది కదూ..
31, డిసెంబర్ 2017, ఆదివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి