కరోనా బారినపడిన దేశాల అగ్రనేతల జాబితాలో రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ (54) సైతం చేరిపోయారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్కు వెళ్లారు. ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను పర్యవేక్షించే మిషుస్టిన్ తరచూ అధ్యక్షుడు పుతిన్ను కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరు చివరిసారిగా ఎప్పుడు భేటీ అయ్యారనే వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆంక్షల సడలింపు హడావుడి స్థాయిలోనే అమెరికాలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యంలో మరో 1,824 వేల మంది వైర్సకు బలయ్యారు. 26,809 కేసులు నమోదయ్యాయి. దేశంలోని జైళ్లలో 2,700 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా 2 వేల మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, కష్టాలు పోనున్నాయని.. ముందుంది మంచి కాలమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటున్నారు. ‘ఓపెనింగ్ అప్ అమెరికా ఎగైన్’ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కరోనా బారిన పడిన రష్యా ప్రధాని
కరోనా బారినపడిన దేశాల అగ్రనేతల జాబితాలో రష్యా ప్రధాని మిఖాయిల్ మిషుస్టిన్ (54) సైతం చేరిపోయారు. దీంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్కు వెళ్లారు. ఆర్థిక వ్యవహారాల బాధ్యతలను పర్యవేక్షించే మిషుస్టిన్ తరచూ అధ్యక్షుడు పుతిన్ను కలుస్తుంటారు. ఈ నేపథ్యంలో వీరు చివరిసారిగా ఎప్పుడు భేటీ అయ్యారనే వివరాలు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఆంక్షల సడలింపు హడావుడి స్థాయిలోనే అమెరికాలో కరోనా మరణాలు కొనసాగుతున్నాయి. అగ్రరాజ్యంలో మరో 1,824 వేల మంది వైర్సకు బలయ్యారు. 26,809 కేసులు నమోదయ్యాయి. దేశంలోని జైళ్లలో 2,700 మంది ఖైదీలకు పరీక్షలు చేయగా 2 వేల మందికి పాజిటివ్ వచ్చింది. అయితే, కష్టాలు పోనున్నాయని.. ముందుంది మంచి కాలమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొంటున్నారు. ‘ఓపెనింగ్ అప్ అమెరికా ఎగైన్’ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి