Translate

  • Latest News

    23, ఆగస్టు 2017, బుధవారం

    రెండు తెలుగు రాష్టాల అధినాయకుల్లో అంతర్మధనం.

    రెండు తెలుగు రాష్టాల  అధినాయకుల్లో అంతర్మధనం.

    ఇప్పట్లో నియోజకవర్గాల  పునర్వివ్యస్త్రీకరణకు అవకాశమే లేదని కేంద్రం  తేల్చి చెప్పటం తో  ఆయా రాష్ట్రాల్లోని  అధినాయకుల్లో అంతర్మధనం మొదలయింది 
    ఆయా పార్టీల్లో  అంతర్గత పోరు  తీవ్రమైంది. ఒకవైపు ఈ అంశం వల్ల తమకు వచ్చిన నష్టం ఏమిలేదని మేకపోతు గాంభీర్యం వహిసూన్నా కొత్తగా పార్టీలో చేరిన వారితో రానున్న రోజుల్లో కష్టాలు మరిన్ని ఎదుర్కొనే  అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీలో టీడీపీ, తెలంగాణాలో తెరాసా ఎవరికి వారే రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని వివిధ పార్టీలకు చెందిన వారిని తమ పార్టీ కండువా కప్పి అధికారపార్టీలో చేర్చుకున్నారు. కేంద్ర ప్రకటన అధికార పార్టీలో చేరినవారి ఆశలపై నీళ్లు చల్లిందనే చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ముందుగా మేల్కొని బుజ్జగింపు చర్యలు ప్రారంభించి, నయాన, భయానో నచ్చచెప్పే ప్రయత్నాలు ప్రారంభిస్తే, ఏపీలో మాత్రం ఇందుకు విరుద్దమైన పరిస్థితి నెలకొనిఉంది. ఇప్పటివరకు కేంద్రంలో మిత్రపక్షంగా వ్యవహరించిన బీజేపీతో సంబంధాలు బెడిసి కొట్టే విధంగా ఉండటం, నంద్యాల ఉప ఎన్నికలు, ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో నియోజకవర్గాల పెంపు అంశం ప్రకటనపై పార్టీలో చేరిన వారితో వస్తున్న సమస్యలను పరిష్కరించే పరిస్థితిలో లేదు. ఇందుకు సీఎం చంద్రబాబునాయుడు, ఇతర మంత్రులు కేంద్రంపై దింపడుకల్లెం ఆశలు పెట్టుకొనే ఉన్నారు. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన వెలువడుతుందని కొత్త గా చేరినవారికి ఊరిసూన్నారు.
    జోడింపుల ప్రాంతం
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రెండు తెలుగు రాష్టాల అధినాయకుల్లో అంతర్మధనం. Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top