ప్రపంచ పర్యాటక కేంద్రాలకు సైతం మత మౌఢ్యం వ్యాపించింది .ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్మహల్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తొలగించింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రోత్సహించడానికి విడుదల చేసిన బుక్లెట్లో గంగా నదికి హారతి ఇవ్వడాన్ని ముఖచిత్రంగా ఇచ్చారు. ప్రతి ఏటా దాదాపు 60 లక్షల మంది పర్యాటకులు, ఎక్కువగా విదేశీయులు తాజ్మహల్ను సందర్శిస్తారు. తాజ్మహల్ను యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించగా.. ప్రధాని మోదీ ‘క్లీన్ ఇండియా మిషన్’కు ఎంపిక చేసిన 10 ప్రాంతాల్లో తాజ్మహల్ చోటు దక్కించుకుంది. రామాయణం, భగవద్గీతలు మాత్రమే భారతీయ సంస్కృతికి చిహ్నాలనీ, తాజ్మహల్ ఎంతమాత్రం కాదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
4, అక్టోబర్ 2017, బుధవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి