షాహిద్ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న రాజ్ కుమార్ రావు ప్రస్తుతం 'బోస్-డెడ్/ఎలైవ్ అనే వెబ్ సిరీస్ తో పాటు న్యూటన్ అనే సినిమాను చేస్తున్నాడు. అమిత్ వి.మసుర్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. ఇందులో ఎన్నికలు సజావుగా జరగనివ్వకుండా గూండాలు, రౌడీలు అడ్డుపడుతుంటే , వారిని న్యూటన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది చూపించారు. బ్లాక్ కామెడీ తరహా సినిమాగా చెబుతున్న ఈ సినిమాలో అల్లర్లు చెలరేగిన చత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ఓ క్లర్కు కథే ఈ సినిమా అని తెలుస్తుంది. ఈ చిత్రంలో రాజకీయపరమైన కామెంట్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది. మావోయిస్టులు దాడి చేస్తారని తెలిసినా... ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించాలన్న లక్ష్యంతో రాజ్ కుమార్ రావు పాత్ర చేసే ప్రయత్నమే న్యూటన్ సినిమా అని తెలుస్తుంది. ఈ సినిమాకి మనీష్ ముంద్ర కథని అందించగా , ఇది చాలా ఫన్నీగా ఉంటుందని తెలుస్తుంది. పంకజ్ త్రిపాఠి, అంజలి పాటిల్, రఘువీర్ యాదవ్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దృశ్యం ఫిలింస్ నిర్మిస్తుంది
30, ఆగస్టు 2017, బుధవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి