పెద్దలు అక్రమ ఆస్తులు కూడ బెట్టుకుంటున్నారని పాపం ఇప్పటి వరకు ఎవరికి వారే గొనుకొంటున్న వారు ఆ పెద్ద మనిషిని పట్టిస్తే ఇక బహమతులు అందుకో వచ్చు. అవును నిజమండి బాబు . . బినామీ ఆస్తుల గుట్టు విప్పేందుకు ప్రజలే ముందుకు రావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని పెట్టబోతోంది. ఈ పథకం కింద బినామీ ఆస్తుల సమాచారం ఇచ్చిన వాళ్లకు ఆస్తి విలువను బట్టి కనీసం రూ.15 లక్షలు, గరిష్ఠంగా కోటి రూపాయలు బహుమతిగా ఇస్తారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) ఉన్నతాధికారి ఒకరు ఈ విషయం వెల్లడించారు. బినామీ ఆస్తుల జాడ చెప్పిన వారి సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారు. వారి ప్రాణాలకు ముప్పు కలగకుండా ఉండేందుకు ఈ జాగ్రత్త తీసుకుంటారు. వచ్చే నెలలో పథకాన్ని ప్రకటిస్తారు. గత ఏడాది నవంబరు 1 నుంచి బినామీ ఆస్తుల నిషేధ చట్టం-2016 అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం అనుసరిస్తున్న పద్దతుల్లో బినామీ ఆస్తుల్ని పసిగట్టడం చాలా కష్టంగా ఉంటోంది. ఇన్ఫార్మర్ల సాయంతో పని చేయడం తేలిగ్గా ఉంటుందని, వేగంగా, సమర్థంగా కదిలి బినామీల బండారం బయట పెట్టవచ్చని అధికారులు చెబుతున్నారు.
23, సెప్టెంబర్ 2017, శనివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి