కారంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తింటారా? అయితే మీరు దీర్ఘ కాలం జీవిస్తారని తాజా పరిశోధన చెబుతోంది. ఎర్రని ఎండు మిరపతో మరణ ముప్పు 13 శాతం తగ్గుతుందని వివరిస్తోంది. ముఖ్యంగా గుండె జబ్బులు, పక్షవాతం నుంచి వచ్చే మరణ ముప్పు తగ్గుముఖం పడుతుందని వెల్లడిస్తోంది. అమెరికాలోని వెర్మోంట్ వర్సిటీ నిపుణులు దీన్ని చేపట్టారు. 16,000 మంది సమాచారాన్ని వారు విశ్లేషించారు. ఎండు మిర్చి కలిపిన ఆహారాన్ని తీసుకున్నప్పుడు కలిగే ప్రయోజనాలపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో మిరపలోని కారానికి మూలమయ్యే కాప్సాయ్సిన్ లాంటి సమ్మేళనాలు మరణ ముప్పును తగ్గిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. వూబకాయం, గుండెకు రక్త ప్రసరణలను నియంత్రించే కణ చర్యల్లో ఈ సమ్మేళనం క్రియాశీలంగా పాలుపంచుకుంటున్నట్లు పరిశోధకులు ముస్తాఫా చోపాన్ తెలిపారు. సూక్ష్మజీవులపై పోరాడే గుణాలూ దీనికి ఉన్నట్లు వివరించారు.
21, అక్టోబర్ 2017, శనివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి