వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా వై.సి.పీ ని వీడుతున్నారనే వదంతి రెండు రోజులుగా హాట్ టాపిక్ అయింది. ఇది కేవలం పుకారు అని రాధా కొట్టిపారేసినప్పటికి నిప్పు లేనిదే పొగ రాదనే మాట కూడా వినపడుతోంది.విజయవాడలో గత ఎన్నికలలో వంగవీటికి బలమున్న సెంట్రల్ సీట్ ఆయనకు ఇవ్వకుండా అది రెడ్డి సామాజికవర్గానికి చెందిన గౌతమ్ రెడ్డికి ఇవ్వడం.. రాధాకు కమ్మ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న తూర్పు సీట్ ఇవ్వడంతో ఇక్కడా... అక్కడా... రెండు చోట్ల ఇద్దరూ ఓడిపోయారు. ఆ విధంగా వై.సి.పీ చేజేతులారా రెండు సీట్లు పోగొట్టుకుంది. ఆ తర్వాత పార్టీ తన తప్పు తెలుసుకుని.. రాధాకు ఈ సారి సెంట్రల్ సీట్ ఇస్తామని చెప్పింది. అయితే... ఏడాది కిందట సెంట్రల్ సీట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మల్లాది విష్ణు ను పార్టీలో చేర్చుకున్నారన్న టాక్ వచ్చినప్పటినుంచి రాధా పార్టీతో అంటి ముట్టనట్టుగానే ఉంటున్నారు.. అది తెలిసి... అధిష్టానం సెంట్రల్.... కాకపోతో తూర్పు ఇస్తాం అని చెప్పి సముదాయించారు. అయితే.. తాజాగా తూర్పులో యలమంచిలి రవి వై.సి.పీ లో చేరడానికి రంగం సిద్ధమైనదని, పాదయాత్ర సందర్భంగా చేరుతారని... ఆయనకు తూర్పు సీట్ ఇస్తామన్నారని టాక్ రావడంతో రాధా మనస్తాపం చెందినట్టు అనిపిస్తోంది. అయితే తానూ నేరుగా బయటపడకుండా... తన అనుచరులతో తానూ పార్టీ మారుతానన్నట్టుగా లీక్ చేయించి.. పార్టీ అధిష్టానానికి ఓక జర్క్ ఇచ్చి... ఆ తర్వాత ఖండించినట్టుగా స్టేట్మెంట్ ఇచ్చినట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీని ద్వారా తనకు సెంట్రల్ సీట్ ఇమ్మని డిమాండ్ చేయవచ్చని అనుకుంటున్నారు... అది కుదరని పక్షములో ఆయన పార్టీని వీడి తెలుగుదేశంలో చేరకపోయినా... ఎలాగో జనసేన రెడీ గానే ఉంది కదా...
18, జనవరి 2018, గురువారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి