మనం ఎక్కడి నుంచి వచ్చామో... ఆ మూలాల్ని మర్చిపోకూడదు. అన్నదాతను పట్టించుకోని ఏ ప్రభుత్వమూ ఎక్కువ కాలం మనజాలదు. కార్పొరేట్ల అడుగులకు మడుగులొత్తుతూ 120 కోట్ల జనాభా కి అన్నం పెట్టె రైతును పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వ పతనం తప్పదు. మట్టి మనిషని తక్కువ చేసి చూడడం తగదు... ఎంత కూడబెట్టిన కూడు పెట్టే రైతును పట్టించుకోకపోతే... చివరకు మనం కూడా ఆ మట్టిలోనే కలిసేది... అన్న నగ్నసత్యం మరువొద్దు. దేశంలో 73 శాతం డబ్బు ఒక్క శాతం కుబేరుల వద్దే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఇంత అసమానత కళ్ళ ముందు కనపడుతుంటే మేం అది సాధించాం... ఇది సాధించాం అని గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం.
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేస్తున్న హత్యలే...

0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి