కుంభకోణం చుట్టు పక్కల గ్రామాల్లో ఎలుక మాంసం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తంజావూరు జిల్లాలో ప్రస్తుతం కరవు తీవ్రతతో పంటలు సాగు చేయలేదు. పొలాలు బీడుగా ఉండటంతో ఎలుకల సంచారం ఎక్కువగా ఉంది. కొంత మంది ఎలుకలను పట్టుకొని రోడ్డు పక్కన విక్రయిస్తున్నారు. చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. కుంభకోణం వద్ద ఉన్న నీలత్తనల్లూర్, ఆవూర్ ప్రాంతాల్లో ఎలుక మాంసం ఎక్కువగా విక్రయిస్తున్నారు. ఎలుక మాంసంలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని చెబుతూ అమ్మేస్తున్నారు. ఆరు ఎలుకలను రూ.200కు విక్రయిస్తున్నారు. పంట పొలాల్లో లభించే ఎలుకల మాంసం బాగుంటుందని ఇతర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు తరలివస్తున్నారు.
23, ఆగస్టు 2019, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి