Translate

  • Latest News

    25, ఏప్రిల్ 2020, శనివారం

    రంజాన్ సంద‌ర్బంగా ఏపీ స‌ర్కార్ ప్ర‌త్యేక చ‌ర్య‌లు


    రంజాన్‌ నేపథ్యంలో ఏపీ సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.  రంజాన్ మాసంలో ప్రత్యేక సడలింపులు ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. మసీదులో ప్రార్థనలకు ఇమామ్, మౌజంతో పాటు మరో ముగ్గురికి అనుమతి కల్పించింది. అలాగే 24 గంటల విద్యుత్ సరఫరా, అవసరానికి సరిపడా మంచినీటి సరఫరా కూడా చేయనుంది. నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్ల షాపులకు ఉదయం 10 గంటల వరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరోవైపు ఇఫ్తార్‌కు అనుగుణంగా సాయంత్రం డ్రై ఫ్రూట్ షాపులకు కూడా అనుమతి కల్పించింది. హోటల్స్‌ను గుర్తించి సెహ్రి, ఇఫ్తార్ సమయాల్లో పార్శిల్స్‌కు అనుమతి ఇచ్చింది. ఇమామ్‌, మైజింలకు పాసులు జారీ చేయనుంది.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రంజాన్ సంద‌ర్బంగా ఏపీ స‌ర్కార్ ప్ర‌త్యేక చ‌ర్య‌లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top