విజయ్, సమంత, కాజల్, నిత్యా మీనన్ హీరోహీరోయిన్లుగా అట్లీ దర్శకత్వంలో తెన్నాండల్ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ పతాకంపై మురళీ రామస్వామి, హేమా రుక్మిణి సంయుక్తంగా తమిళంలో నిర్మిస్తున్న చిత్రం 'మెర్సల్'. ఈ చిత్రాన్ని తెన్నాండల్ స్టూడియోస్తో కలిసి నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత శరత్ మరార్ 'అదిరింది' పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి శరత్ మరార్ మాట్లాడుతూ, 'విజరు నటిస్తున్న 61వ చిత్రమిది. అలాగే తెన్నాండల్ స్టూడియోస్లో వందవ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ బ్యానర్తో అసోసియేట్ కావడం చాలా హ్యాపీగా ఉంది. 'బాహుబలి', 'భజరంగీ భాయిజాన్' వంటి చిత్రాలకు కథ అందించిన విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే అందించడం విశేషం. ఇండియాలోని పలు ప్రాంతాలతోపాటు యూరప్లోని అందమైన లొకేషన్లలో షూటింగ్ జరిపాం. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగులో దీపావళికి విడుదల చేయబోతున్నాం. ఇదొక లాండ్మార్క్ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాం' అని అన్నారు. ''కాటమరాయుడు', 'సర్దార్ గబ్బర్ సింగ్' లాంటి భారీ చిత్రాలు నిర్మించిన శరత్ మరార్కి టీవీ ఇండిస్టీలో మంచి పేరుంది. ఆయన ఈ ప్రాజెక్ట్లో జాయిన్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహ్మాన్ ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలను సమకూరుస్తున్నారు. తెలుగులో దీపావళికి గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నాం' అని నిర్మాత మురళీ రామస్వామి తెలిపారు.
17, సెప్టెంబర్ 2017, ఆదివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి