Translate

  • Latest News

    21, సెప్టెంబర్ 2017, గురువారం

    జియో దృష్టి ఇప్పుడు యాపిల్‌ యూజర్లు



    వరుస ఆఫర్లతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రిలయన్స్‌ జియో దృష్టి ఇప్పుడు యాపిల్‌ యూజర్లను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.  యాపిల్‌ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఐఫోన్‌ 8, ఐఫోన్‌8 ప్లస్‌ ప్రీ బుకింగ్‌లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో జియో మరోసారి తన భారీ ఆఫర్లకు తెరతీసింది.  అన్ని రిలయన్స్‌ డిజిటల్‌ అవుట్‌లెట్స్‌, జియో స్టోర్స్‌, జియో వెబ్‌సైట్‌తో పాటు మై జియో యాప్‌ ద్వారా ఫోన్లు బుకింగ్‌ సదుపాయాన్ని క‌ల్పించింది. వీటి ద్వారా ఫోన్‌బుక్ చేసుకున్న వినియోగ‌దారుల‌కు  రూ.10వేలు క్యాష్‌ బ్యాక్‌తో పాటు 70శాతం బై బ్యాక్‌ను ప్రకటించింది. కేవలం సెప్టెంబర్‌ 22 నుంచి సెప్టెంబర్‌ 29 మధ్యలో బుక్‌ చేసుకున్న వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ రెండు మోడళ్లు 64జీబీ, 256జీబీ వేరియంట్లలో వస్తున్నాయి.
    రూ.10వేలు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ వర్తించాలంటే వినియోగదారుడు సిటీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో రూ.54,000కే ఐఫోన్‌8 వస్తుంది. అదే 256 జీబీ అయితే రూ. 67,000లకే లభిస్తుంది. ఐఫోన్‌ 8 ప్లస్‌లో 64జీబీ మొబైల్‌ రూ.63,000లకు .. 256జీబీ మోడల్‌ను కేవలం రూ. 76,000లకే పొందవచ్చు.
    ఇది ఇలా ఉండగా.. జియో స్టోర్స్‌లో ఈ మొబైల్స్‌ని కొన్న వినియోగదారులు ఏడాది లోపు మళ్లీ వాటిని తిరిగి ఇచ్చేస్తే.. వారికి 70 శాతం బై బ్యాక్‌ ఇవ్వనున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది. అంటే ఐఫోన్‌ 8 ప్లస్‌లో మోడల్‌లో 256జీబీ ఫోన్‌ను రూ.86వేలకు కొన్న వినియోగదారుడు మళ్లీ ఆ ఫోన్‌ను తిరిగి ఇచ్చేస్తే రూ.60,200 తిరిగి ఇస్తారన్నమాట.

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: జియో దృష్టి ఇప్పుడు యాపిల్‌ యూజర్లు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top