Translate

  • Latest News

    13, అక్టోబర్ 2017, శుక్రవారం

    బీజేపీ ,టీడీపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం....ఏపీ భూసేకరణ బిల్లుకు కేంద్రం బ్రేక్‌


    రాష్ట్రంలో అధికారం లో ఉన్న టీడీపీ  ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వనికి మధ్య సంభందాలు దెబ్బ తిన్నాయా.. అంటే నిజమని చెప్పక తప్పదు . వరస వెంబడి సంభవిస్తున్న పరిణామాలు ఇందుకు అద్దం పడుతున్నాయి . గత కొన్ని 
    నెలల నుంచి  బీజేపీ ,టీడీపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతొంది . ఈ దిశలో 
    ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ బిల్లుకు కేంద్రం బ్రేక్‌ వేసింది. అభివృద్ధి పనులకు పంటభూములను సేకరించడంపై కేంద్ర 
    వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. గుజరాత్‌, తెలంగాణ భూసేకరణ బిల్లులకు ఆమోదం తెలిపిన కేంద్రం, అదే తరహాలో రూపొందించిన ఏపీ బిల్లుపై మాత్రం అభ్యంతరాలు తెలపడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భూసేకరణ బిల్లును ఆమోదించింది. దీన్ని కేంద్రం అనుమతి కోసం పంపింది. అదే సమయంలో గుజరాత్‌, తెలంగాణ భూసేకరణ బిల్లులూ కేంద్రం ఆమోదానికి వచ్చాయి. ఈ మూడు బిల్లులూ ఒకే మాదిరి ఉన్నాయి. ఒక్క క్లాజులో కూడా మార్పులేదు. గుజరాత్‌, తెలంగాణ బిల్లుకు కేంద్రం వెంటనే ఆమోదం తెలిపింది. ఏపీ బిల్లులో పంట భూముల సేకరణకు సంబంధించిన సెక్షన్‌ 10(ఏ)కు కేంద్ర వ్యవసాయశాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతో బిల్లుకు బ్రేక్‌ పడింది. నిజానికి ఇదే క్లాజ్‌ గుజరాత్‌, తెలంగాణ బిల్లులలోనూ ఉన్నా అప్పుడు పట్టించుకోలేదు. పైగా ఈ రెండు రాష్ర్టాల బిల్లులను అసలు వ్యవసాయశాఖ పరిశీలనకే పంపలేదు. తెలంగాణ భూసేకరణ బిల్లును గ్రామీణాభివృద్ధి శాఖకు పంపి అభిప్రాయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ, గుజరాత్‌ బిల్లును మాత్రం ఏ ఒక్క శాఖకు పంపకుండా నేరుగా ఆమోదం తెలిపింది.
     టీడీపీ కూడా బీజేపీ సంభందాలు దెబ్బతిన్నా దాన్ని అనుకూలంగా మార్చుకోవటానికి సర్వసిద్ధంగానే ఉంది మోడీ ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన అనంతరం మొండిచేయి చూపడం ప్రత్యేక హోదా వంటి విషయాలు వెలుగులోకి తెచ్చి తద్వారా ఏపీకి బీజేపీ ఏమి చేయలేదు అనే అంశాన్ని జనాల్లోకి తీసుకువెళ్లి ఇరుకున పెట్టాలని  టీడీపీ భావిస్తోంది.స్థానికంగా బీజేపీ బలంగా లేకపోవడం కూడా తమకు అనుకూల అంశాలని టీడీపీ లెక్కలు వేస్తోంది. బీజేపీ తమతో ఉన్నా లేకపోయినా తమ పార్టీకి వచ్చిన నష్టమేమి లేదని టీడీపీ గంభీరంగా చెబుతోంది.

                                                                                                                                        శ్రీహర్ష 

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: బీజేపీ ,టీడీపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం....ఏపీ భూసేకరణ బిల్లుకు కేంద్రం బ్రేక్‌ Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top