పె ళ్లి ముహూర్తాలు ముంచుకు వస్తున్నాయి. ఈనెల 23,24,25 తేదీల్లో తెలుగురాష్ట్రాల్లో లక్షకుపైగా వివాహాలు జరుగనున్నాయి. దీంతో మండపాల నుంచి బ్యాండు మేళం వరకు పురోహితుల నుంచి డెకరేషన్ చేసే వారి వరకు అందరికీ యమ గిరాకీ ఏర్పడింది.ఈ తేదీల్లో లక్షకుపైగా పెళ్లిళ్లు జరుగబోతున్నాయి. ఒక మాసంలో మూడు రోజుల్లో ఇంత భారీ సంఖ్యలో వివాహాలు జరగడం ఇదే మొదటి సారి అని పురోహితులు చెబుతున్నారు. హేవళంబినామ తెలుగు సంవత్సరంలో మూఢాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈనెల 28 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వరకు శుక్రమౌఢ్యమి ఉందని ఈ సమయంలో పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఏడాది మూఢాల వల్ల మంచి ముహూర్తాలు లేక వివాహాలు తక్కువ సంఖ్యలో జరిగాయి. ఈనెల 23,24,25 తేదీలు తప్పితే మళ్లీ వచ్చే ఏడాది మార్చిలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయి. అందుకే ఈ మూడు రోజుల్లో లక్షకు పైగా పెళ్లిళ్లు జరుగనున్నాయని చెబుతున్నారు. రాజధాని అమరావతి ఉన్న కృష్ణా, గుంటూరు పరిధిలో పాతికవేల ముహూర్తాలు కుదిరినట్లు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో ముహూర్తాలు ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా కళ్యాణమండపాలన్నీ ముందే బుక్ అయ్యాయి. ఆ మూడు రోజుల్లో ఖాళీగా ఉన్న కళ్యాణమండపం ఒక్కటి కూడా లేదు. చివరకు ఆలయాల్లోనూ కిటకిటే. ఇక పురోహితులతో పాటు, క్యాటెరింగ్, వంటపనివారు, లైటింగ్, అలంకరణ, బ్యాండ్, పూలు, ఫోటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు తెగ డిమాండ్ పెరిగింది.
13, నవంబర్ 2017, సోమవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి