Translate

  • Latest News

    28, జనవరి 2018, ఆదివారం

    పవన్ ఎటువైపో స్పష్టత వచ్చేసింది


    ఇంకా సంశయం అక్కరలేదు అనుకుంటా .. పవన్ ఎటువైపో స్పష్టత వచ్చేసింది. చలోరే చలోరే చల్‌ యాత్రలో భాగంగా అనంతపురంలో పర్యటిస్తున్న జనసేన అధ్యక్షుడు ఆదివారం ఉదయం మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారు. అక్కడే అల్పాహారాన్ని స్వీకరించి, అనంత సమస్యలపై చర్చోపచర్చలు చేశారు. .టీడీపీతో జనసేన పొత్తు, సీమకు పొంచిఉన్న ప్రమాదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజాభీష్టం మేరకు, ప్రజలు కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తుపై నిర్ణయం తీసుకుంటా. ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సరికాదు. ఏపీ హైకోర్టు రాయలసీమలో ఏర్పాటయ్యేలా కృషి చేస్తాను. వెనుకబాటుకు గురైన రాయలసీమను సత్వరం అభివృద్ధి చేయకుంటే ప్రాంతీయవాదం తలెత్తే ప్రమాదం ఉంది’’ అని పవన్‌ అన్నారు. 2019 ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చెయ్యబోయేది ఇంకా నిర్ణయించుకోలేదని, దానిపై త్వరలోనే ప్రకటన చేస్తానని తెలిపారు.తాను ఎవరికీ తొత్తు కాదన్న పవన్‌.. సమస్యల అధ్యయనం కోసమే యాత్ర చేస్తున్నట్లు ఇదివరకే చెప్పుకున్నారు.  కానీ ఇప్పడు  పొత్తు విషయం  ప్రజలపై  పెట్టేసారు.  ప్రజలు కోరితే వచ్చే .... అనే మాట పవన్ నోటా వచ్చిందంటే రాజకీయాలు  బాగా వంట పట్టించుకున్నట్లే ... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: పవన్ ఎటువైపో స్పష్టత వచ్చేసింది Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top