నిన్నటిదాకా జె.ఎఫ్.సి అంటు... లెక్కలు తేల్చుతామంటూ.. అన్ని పార్టీల మేధావులను పిలిచి చర్చలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించారు. ఓ పక్క రాష్ట్రమంతా ప్రత్యేక హోదా కోసం పోరాడాలంటుంటే మనం ఇలా చర్చలు చేస్తూ కూర్చుంటే ఎలా అని గ్రహించారు. పవన్ కూడా హోదా బాట పట్టారు. పెట్టటమే కాదు... లేట్ గా వచ్చినా లేటెస్టుగా వచ్చినట్టు... ఈ విషయంలో ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా హోదా ఉద్యమాన్నే హైజాక్ చేయడానికి మాస్టర్ ప్లాన్ వేశారు. తెలంగాణ ఉద్యమం విజయవంతంలో ఉస్మానియా విద్యార్థుల పాత్ర ఏంటో అందరికి తెలిసిందే... అలాగే హోదా ఉద్యమానికి రాష్ట్రంలో వర్శిటీ విద్యార్థులను వాడుకోవడం ద్వారా హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో పాటు, జనసేన పార్టీ కి కుడా విద్యార్థులు, యూత్ లో బలమైన పునాదులు వేయవచ్చు అనేది వారి ప్లాన్. ఇందులో భాగంగా ప్రత్యక హోదా మన హక్కు అని ముదిరించిన టీ షర్ట్ లను రాష్ట్రంలోని అన్ని విశ్వవిదాయాలయాల స్టూడెంట్స్ కు పంచేందుకు సిద్హం చేసారు. వీటితో పాటు టోపీలు కూడా.. పవన్ కళ్యాణ్. మార్చ్ 14 న జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడు భారీ బహిరంగ సభకు పవన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా టోటల్ గా హోదా ఉద్యమాన్ని హైజాక్ చేయనున్నారు. అన్నట్టు జనసేన విద్యార్థి విభాగానికి భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ అని పేరు పెట్టారు. ఆ విధంగా భగత్సింగ్ పేరును హైజాక్ చేసేసారు. గతంలో పవన్ కళ్యాణ్ చేగువేరా ను మాక్సిమం వాడేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఆ మధ్య తన సభల్లో గుంటూరుశేషేఇంద్ర శర్మ కవితల్ని కూడా బాగా వాడేసుకున్నారు. ఇలా వాడుకోవడంలో చంద్రబాబు కన్నా రెండు ఆకులు ఎక్కువే తిన్నాడు..
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి