జయలలిత లాగానే... శ్రీదేవి మృతి కూడా... మిస్టరీయేనా..? ఇద్దరూ ఇద్దరే... కోట్లాది ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నవారే. అభిమానుల ఆరాధ్య దేవత గా కొనియాడబడిన వారే... ఒకరు వెండి తెరను, ఆ తర్వాత తమిళ రాజకీయాలు శాసించారు. మరొకరు హోల్ ఇండియా సినీ సామ్రాజ్యాన్ని తన కంటి చూపులతో సమ్మోహనం చేశారు. ఒకరు అమ్మగా.. మరొకరు యువ హృదయాల్లో గిలిగింతలు పెట్టె సౌందర్య రాశిగా.. కానీ వారిద్దరి అంతర్ధానం ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. అసలు వారికి మరణం అనేది ఉంటుందన్న ఊహే అభిమానులకు వచ్చేది కాదు. కానీ ఇద్దరి మరణాల వెనుకా ఎన్నో అనుమానాలు... మరెన్నో ప్రశ్నలు... జయలలిత మరణించి ఏడాది దాటినా ఆ ప్రశ్నలకు ఇంకా సమాధానాలు దొరకలేదు. శ్రీదేవి మరణించి మూడు రోజులైనా ఇంకా ఆ పార్థివ దేహం అంత్యక్రియలకు నోచుకోలేదు. అలాంటి మనిషికి ఇలాంటి దుస్తుతి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ముఖ్యంగా మృతి తర్వాత గంటకో విధంగా వస్తున్న వదంతులు... అభిమానులకు మింగుడుపడని చేదు గుళికల్లా గొంతులో అడ్డు పడుతున్నాయి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ... ఎవరూహించెదరు...అన్న లవకుశలో పాట ఈ సందర్భంగా స్ఫురణకు వస్తోంది..
27, ఫిబ్రవరి 2018, మంగళవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి