నేను లేస్తే మనిషిని కాను అన్నాట్ట... వెనకటికి ఓ కుంటోడు. ఆలా ఉన్నాయి చంద్రబాబు మాటలు. నేను తల్చుకుంటే కేంద్ర ప్రభుత్వ వాహనాలేమీ రాష్ట్రంలో తిరగనివ్వను.... కానీ ఆలా చేస్తే రాష్ట్రానికే నష్టం కదా... అందుకే చేయడం లేదు అంటాడు. నష్టం రాష్ట్రానికా...ఆయనకా... ప్రత్యేక హోదా కోసం పోరాడతానంటాడు... బంద్ చేసి ఏమి సాధిస్తారు... అంటాడు. అసలు నేను తల్చుకుంటే బి.జె.పీ కి రాష్ట్రంలో అడ్రస్ లేకుండా చేస్తాను అంటాడు. అసలు బి.జె.పీ తో పొత్తు పొట్టుకోవడం వల్లే సీట్లు తగ్గాయి...లేకపోతో మాకు ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేయి అంటాడు. 1999 లో గెలుపు లోనూ... 2014 లో గెలుపు లోనూ బి.జ్.పీ తో పొత్తు తెలుగుదేశం పార్టీని గెలిపించిందని రాజకీయ నిపుణులందరూ చెబుతుంటే ఈయన మాత్రం ఆబ్బె...వాళ్ళదేం లేదు...అంతా నా ప్రతాపమే అంటాడు. ఇంకో జోక్ ఏమిటంటే అసలు మోడీ ని తెలుగుదేశం ఎం.పీ లతో ప్రతిపాదించి ప్రధానిగా చేసింది నేనేనని.... అంటున్నాడు.. భళా... ఇది ఈ శతాబ్దపు జోక్ అనవచ్చేమో... చివరిగా ఓ ట్విస్ట్ ఈ ప్రేలాపనలన్నీ చంద్రబాబు పేలింది ఎక్కడో తెలుసా... 18 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన పోలీస్ సాంకేతిక భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో... భలే సరదాగా ఉన్నాయి కదూ... చంద్రబాబు సంధి ప్రేలాపనలు...
13, ఏప్రిల్ 2018, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి