కర్నాటక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ఏదో జరుగుతుందని సోషల్ మీడియా, మరోవైపు ప్రతిపక్షనాయకులు పదే పదే చెబుతూ ఉత్కంతకు కారణమౌతున్నారు. సీఎం చంద్రబాబుపై అవినీతి కేసులు బయటకు తీస్తారని, సీబీఐతో విచారణ జరిపి సీఎం చంద్రబాబునాయుడును జైలుకు పంపిస్తారని చెబుతున్నారు.వైసీసీ సోషల్ మీడియా మరోక అడుగు ముందుకు వేసి చంద్రబాబు జైలు కు వెళ్లే క్రమంలో వైసీసీ సానుభూతి పరులపై దాడులు జరిగే అవకాశం కూడా ఉంటుందంటూ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు సైతం స్వయంగా ఎన్నికల అనంతరం తనపై దాడులు జరగవచ్చని చెప్పటం ఈ ప్రచారానికి ఊతమిచ్చింది. నిజంగా అటువంటి పరిస్థితి ఉంటుందా.... చంద్రబాబు అవినీతి ఆరోపణలు నిరూపిస్తారా... అన్నదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిగా మారింది.
ఓటు కేసులో చంద్రబాబు జైలుకు వెళ్తారా... ?
గత కొన్ని రోజుల నుంచి మరో చర్చ కొనసాగుతుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ , చంద్రబాబు నాయుడు ఓటునోటు కేసులో సమీక్ష నిర్వహించారు. న్యాయవాదులు, పోలీసులు ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీంతో ఈ కేసులో చంద్రబాబు అరెస్టు తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి..ఫోన్లో మాట్లాడిన వాయిస్ చంద్రబాబుదే అని పోరన్సిక్ ల్యాబ్ నిర్ధారించిందని చెబుతున్నారు. అయితే చంద్రబాబునాయుడుని ఏ1 నిందితుడిగా చేసి చార్జిషీట్ దాఖలు చేసినా అరెస్ట్ అంశం అంత సామాన్యమైన విషయం కాదన్నది తెలంగాణ సీఎం కేసీఆర్కు తెలుసు. ఇదే విషయంపై టిడిపి నాయకులు చాలా ధీమాగా ఉన్నారు. తమ నాయకుడికి ఈ కేసులో ఏమి కాదని చెబుతున్నారు. ఇదే క్రమంలో ఫోన్ ట్యంపింగ్ అనేది వ్యక్తిగత విషయాలపై నిఘా పెట్టడమే అవుతుందని , ఇందుకు తెలంగాణ సర్కార్ ఫోన్ ట్యాంపింగ్లో వ్యవహారంలో దోషిగా నిలబడాల్సి వస్తుందని చెబుతున్నారు. కొంతమంది మాత్రం రెండు రాష్ట్రల మద్య జరిగే అంతర్గత వ్యవహారం తప్పా ఈ కేసులో పురోగతి ఉండదని చెబుతున్నారు. చంద్రబాబు నిజంగా దోషి అయినా వ్యవస్థలను మేనేజ్ చేసే విషయంలో దిట్ట అని గతం జరిగిన పలు సంఘటనలు గుర్తుచేస్తున్నారు.
ఎన్నికల అనంతరం ఏం జరుగుతుంది...
కర్ణాటక ఎన్నికల అనంతరం ఎం జరుగుతుందన్న విషయంలో చర్చలు కొనసాగతున్నాయి. బీజేపీ నేతలు ఏదో జరగ బోతుందన్న సంకేతాన్ని పంపుతున్నారు. అయితే చంద్రబాబు నైజం తెలిసిన వారు ఏమి జరగవన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికి పలువురు బీజేపీ పెద్దలతో చంద్రబాబు సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని ఈ సందర్బంగా వారు ఉదహరిస్తున్నారు. టిటీడీ పాలక మండలి సభ్యురాలుగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే భార్య కు అప్పగించటం , తన ఆత్మీయుడు సీఎం రమేష్ ఇప్పటికి బీజేపీ పెద్దలతో టచ్ ఉండటం , ఇందుకు సంబంధించి ఏదైనా జరిగినా అధికారులతో చంద్రబాబుకు ఉన్న పరిచయాలు వీటి నుంచి బయట పడేందుకు దోహదపడే అవకాశం ఉంది. మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో చంద్రబాబుకు సానుభూతికి ఉపయోగపడే ఏ పని బీజేపీ చేయకపోవచ్చని పలువురు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద కర్నాటక ఎన్నికల తర్వాత చంద్రబాబుపై ఎదో జరుగుతున్నట్లు హాడావిడి మాత్రం జరగవచ్చు కాని ఎటువంటి చర్యలు ఉండకపోవచ్చని తెలుస్తుంది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి