చెడు వినవద్దు... చెడు కనవద్దు... చెడు మాట్లాడవద్దు... ఇదీ... చంద్రబాబు గారు తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన సందేశం. మహాత్మా గాంధీ మూడు కోతుల సందేశం. వైజాగ్ లో మంగళవారం జరిగిన ధర్మ పోరాట దీక్షలో భాగంగా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒకాయన మతం పేరుతొ వస్తున్నాడు... ఇంకొకాయన కులం పేరుతో వస్తున్నాడు... ఒకటి అవినీతి పార్టీ... ఇంకొకటి కీలుబొమ్మ పార్టీ... ఒకాయన రూ. 43 వేల కోట్లు (మొన్నటి దాకా లక్ష కోట్లు అన్నారు...ఇప్పుడు రూ. 43 వేల కోట్లు కు దిగారు...) దోచేసి, వారం వారం కోర్టు లో చేతులు కట్టుకు నిలబడి, బయటకు వచ్చి నన్ను విమర్శిస్తాడు... ఇంకొకాయన బి.జె.పీ కీ ఇచ్చి ఎలా ఆడమంటే ఆలా ఆడతాడు.. వాళ్ళు నా గురించి... నేను అవినీతి పరుడనని చెడుగా చెబుతారు.... అవేవి వినవద్దు... వాళ్లు నా గురించి చెడుగా ఏమి చెప్పినా వినవద్దు...కన వద్దు... మాట్లాడవద్దు.. ఇదీ... బాబు గారు కార్యకర్తలకు ఇచ్చిన మహాత్మా గాంధీ గారి మూడు కోతుల సందేశం...
నిజమే.. బాగానే సెలవిచ్చారు...బాబు గారు... ఈ సందేశం... ఆయన పార్టీ కార్యకర్తలకే కాదు... అఖిలాంధ్ర ప్రజానీకానికి నా విజ్ఞప్తి... అయ్యలారా... అమ్మలారా... మీరు చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి ఎవరు తప్పుగా చెప్పినా వినవద్దు... గట్టిగా చెవులు మూసుకోండి... ఎవరైనా చెడు జరుగుతొందని కళ్ళ ముందు చూపించినా చూడవద్దు.. కళ్ళకు గంతలు కట్టుకోండి... ప్రభుత్వంలో జరుగుతున్న చెడు గురించి మీకు తెలిసినా మాట్లాడవద్దు. నోటికి చేతులు అడ్డం పెట్టుకోండి... మహాత్మా గాంధీ మూడు కోతుల సిద్దాంతం మనకు ఆదర్శం... చంద్రబాబు గారి వాక్కే మనకు వేదం.. జై... చంద్ర బాబు... జై.. లోకేష్ బాబు... జై... తెలుగుదేశం...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి