ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తులు అరుదుగా ఉంటారు... అలాంటి వారిలో ప్రముఖ సంగీత దర్శకుడు రెహమాన్ ఒకరు. భారత దేశంలో ఎవరికీ అందని ద్రాక్ష లాంటి ఆస్కార్ అవార్డును సునాయాసంగా అందుకున్న రెహమాన్ అంత ఉన్నత స్థాయికి ఎదిగినా... కాళ్ళు మాత్రం ఎప్పుడు నేల మీదే ఉంటాయి. తన మూలాల్ని ఎన్నడూ మరువని మనిషి... మానవత్వం గుబాళించే మంచి మనిషి... గతంలో అనేకసార్లు తనలో ఉన్న మంచితనాన్ని మనకు చవి చూపించిన ఆయన... ఇప్పుడు తాజాగా మరోసారి ఆ విషయాన్ని రుజువు చేసుకున్నాడు. గత నెలలో జల ప్రళయంలో చిక్కుకుని అపార నష్టం జరిగిన కేరళకు తన వంతుగా కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. ప్రస్తుతం తన బృందంతో కలసి అమెరికా పర్యటనలో ఉన్న రెహమాన్ అక్కడనుంచే తన బృందం తరపున కేరళకు కోటి రూపాయల సాయం చేస్తున్నట్టు ప్రకటించాడు. పైగా ఈ చిన్న సాయం మీకు కాస్త ఊరట ఇస్తుందని ఆశిస్తున్నాను... అని తన ట్విట్టర్లో ప్రకటించడం ద్వారా తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నాడు. అంతేకాదు ఆదివారం అమెరికాలో నిర్వహించిన సంగీత విభావరిలో కేరళ ప్రజల కోసం... డోంట్ వర్రీ కేరళ... డోంట్ వర్రీ... అంటూ ఆ రాష్ట్ర ప్రజలకు నుద్దేశించి పాట కూడా పాడాడు. శహభాష్ రెహమాన్,,,శహభాష్
3, సెప్టెంబర్ 2018, సోమవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి