రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి తాపీగా కూర్చుని ఫిడేల్ వాయించుకున్నాడట... మన చంద్రబాబు గారు కూడా నీరో చక్రవర్తి వారసత్వం పుణికి పుచ్చుకున్నట్టుంది... ఓ పక్క సగం రాష్ట్రం పైగా కరువుతో అల్లల్లాడుతుంటే... నీరు వదలక పొలాలు బీళ్లవుతుంటే... కృష్ణ లో నీళ్లు ఉంచుకుని కూడా... పంటలకు నీళ్లు ఇవ్వకుండా... అభినవ నీరో చక్రవర్తి గారు ఎఫ్1హెచ్ 2 వో రేస్ ల కోసం నీళ్లు అట్టే పెట్టేశారట... మొత్తానికి దిగ్విజయంగా ఎఫ్1హెచ్ 2 వో రేస్ లు కూడా నిర్వహించేశారు. ప్రపంచ పటంలో అమరావతిని నిలిపేశారు... దటీజ్ చంద్రబాబు... రైతులు ఏమైపోతేనేం... బాబు గారి పేరు వరల్డ్ లో మార్మోగిపోవాల... పంటలు పండకపోతేనేం.. అవసరమైతే జనాలు కేజీ బియ్యం 100 రూపాయల పెట్టి అయినా కొనుక్కురంటారు. కొనుక్కోక చస్తారా... ఎఫ్1హెచ్ 2 వో రేస్ లు నిర్వహించిన అయిదారు నగరాల్లో మన అమరావతి పేరు చేరిందా... లేదా... కొట్టండి చప్పట్లు.. జై కొట్టండి చంద్రబాబుకు... వచ్చే ఎన్నికల్లో మరొక్కసారి గెలిపించండి మన చంద్రబాబును....మన రాష్ట్రంలో భూములన్ని రైతుల వద్ద నయానా...భయానా లాక్కుని ఒక లక్ష ఎకరాల్లో ఒలింపిక్ సిటీ కట్టేస్తారు... ఈ సారి అమరావతిలో గ్యారంటీగా ఒలింపిక్స్ నిర్వహించేస్తారు. ఈ సారి కాదు చంద్రబాబు గారి ప్రతిభ చూసి... ప్రపంచ దేశాలన్నీ నాలుగేళ్లకు ఒక దేశంలో కాకుండా ఒలింపిక్స్ పెర్మనెంటుగా అమరావతిలోనే నిర్వహించేలా ఏకగ్రీవ తీర్మానం చేసేస్తాయి. అమరావతి పేరు ప్రపంచమంతా మార్మోగిపోద్ది. చంద్రబాబు దేశానికి కాదు... ప్రపంచానికే నాయకుడై పోతారు... ఇక రైతు అనేవాడు మన రాష్ట్రంలో లేకుండా చేస్తాడు. రైతులందరికీ టూరిజం గైడ్ లుగా శిక్షణ ఇచ్చి... గైడ్ ఉద్యోగాలు కల్పిస్తాడు. జై...చంద్రబాబు... జై..జై...చంద్రబాబు..
19, నవంబర్ 2018, సోమవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి