ఏడేళ్ల కిందట ఢిల్లీలో నిర్భయ ఉదంతం దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఆ తర్వాత ప్రభుత్వం కఠిన చట్టాలు తెచ్చింది. ఇటువంటి దురంతాలు ఇక జరగవని ఆశించాం.. కానీ మరింత పెరిగాయి.. నగరాలు, పట్టణాలు, గ్రామాలూ.. ఎక్కడ పడితే అక్కడ... నెలల పసికందు నుంచి... 80 ఏళ్ల బామ్మ వరకు ఆడదిగా పుట్టడమే శాపమయింది. కామాంధుల అకృత్యాలకు నిత్యం ఎందరో బలవుతూనే ఉన్నారు..
వేటూరి గారే అన్నట్టు శిశువులుగా పుట్టి మీరు పశువులుగా మారితే... మానవ రూపంలోనే దానవులుగా పెరిగితే... ఏమైపోతుంది... సభ్య సమాజం... ఏమైపోతుంది...మన భారత దేశం... మరిప్పుడు ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంత మంది వేటూరి లు తమ కలాల్ని కత్తులుగా దూసినా ఎన్ని ప్రతిఘటనల లాంటి సినిమా పాటలు వచ్చినా మార్పు రానంతగా మొద్దుబారిపోయిందీ సమాజం... ఒరేయ్... స్తీ జననాంగాన్ని మర్మస్థానంగా.... నీ నరాల్లో వేడి చల్లార్చుకునే శీతల కేంద్రంగా చూడొద్దురా... అది సృష్టికి ప్రతి సృష్టి చేసే... రేపు నీ బిడ్డలకు జన్మనిచ్చే పుణ్య క్షేత్రంగా చూడండిరా.. అని జ్ఞానోదయం చేయాల్సిన అవసరం ఉంది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి