Translate

  • Latest News

    27, సెప్టెంబర్ 2017, బుధవారం

    మయన్మార్‌ సరిహద్దుల్లో భారత దళాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు



    మయన్మార్‌ సరిహద్దుల్లో బుధవారం ఉదయం 4.45 గంటల సమయంలో భారత దళాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగినట్లు సైన్యం అధికారికంగా ప్రకటించింది. మయన్మార్‌ సరిహద్దు వద్ద లెంఖు గ్రామంలోని ఎన్‌ఎస్‌సీఎన్‌(కె) ఉగ్ర శిబిరాలపై దాదాపు 70 మంది భారత పారా కమాండోలు దాడులు జరిపినట్లు పేర్కొంది.
    ఈ దాడుల్లో చాలా మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు భారత సైన్యంలోని తూర్పు కమాండ్‌ తెలిపింది. అయితే మన జవాన్లు గాయపడ్డారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వెల్లడించింది. భారీగా నష్టపోయిందని ఉగ్రవాదులేనని మన సైన్యానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదని అధికారులు తెలిపారు. ఈ దాడులు చేసే క్రమంలో అంతర్జాతీయ సరిహద్దులను దాటలేదని పేర్కొంది.
    ఈ సందర్భంగా తూర్పు కమాండ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది.

     ‘ఈరోజు ఉదయం ఉగ్రమూకలు భారత జవాన్లపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పులను మన దళాలు దీటుగా తిప్పికొట్టాయి. దాంతో కొందరు ఉగ్రవాదులు పారిపోయారు. మరికొందరు చనిపోయారు. ఈ దాడుల్లో భారత సైన్యానికి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. నాగా ఉగ్రవాదులకు భారీగా నష్టం వాటిల్లింది.’ అని పేర్కొంది.
    రెండేళ్ల క్రితం భారత ఆర్మీ మయన్మార్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించింది. 2016లో కూడా పాకిస్థాన్‌ ముష్కరులకు బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ స్రైక్ట్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పట్లో పీవోకేలోని నాలుగు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి దాదాపు 40 మంది ముష్కరులను మట్టుబెట్టింది. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: మయన్మార్‌ సరిహద్దుల్లో భారత దళాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top