భక్తి తో తలపై మోసిన వారే బాబాల అసలు రంగు బయట పడితే వ్యవహరించే తీరు కు ఈ సంఘటన నిలువు టద్దం లా నిలుస్తోంది .రావణాసురుడిలా ప్రవర్తించిన డేరాబాబా గుర్మీత్ రామ్ రహీం బొమ్మను రానున్నదసరా పర్వదినం సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దహనం చేయనున్నారు. ఇందుకోసం సుమారు 50 అడుగుల ఎత్తయిన బొమ్మను తయారు చేయించారు. దీనిపై డేరా బాబా 10 ముఖాలను చిత్రించారు. సాధుసన్యాసులే స్వయంగా ఈ దహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇండోర్కు చెందిన సూర్యమిత్ర సంజయ్ అనే వ్యక్తి ఈ డేరా బాబా బొమ్మను రావణాసురుడిని పోలినట్టు రూపొందించారు. ఇండోర్లోని జైలు రోడ్డు మైదానంలో దసరా నాడు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.
26, సెప్టెంబర్ 2017, మంగళవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి