Translate

  • Latest News

    24, అక్టోబర్ 2017, మంగళవారం

    రామోజీరావుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ ఏ పరిణామాలకు దారితీస్తుందో ...


    ఈనాడు తన ధోరణి మార్చుకుంది. గత కొంత కాలంగా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, కధనాలు ప్రచురిస్తూ అధికారం లో ఉన్న టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతొంది ఈ దశలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం భేటీ కావటం చర్చనీయాంశంగా మారింది . సుమారు 40 నిమిషాలపాటు మంతనాలు జరిపారు. సీబీఐ కోర్టు తీర్పు పరిణామాలు, పాదయాత్రపై రామోజీరావుతో చర్చించినట్లు సమాచారం.  జగన్ వెంట భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా నవంబర్ 6 నుంచి తలపెట్టిన పాదయాత్రకు ఆశీస్సులు తీసుకునేందుకు రామోజీరావును జగన్ కలిసినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.చూద్దాం వీరి మధ్య సంభాషణ ల సారాంశం ఏ ఏ పరిణామాలకు దారితీస్తుందో ... 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: రామోజీరావుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భేటీ ఏ పరిణామాలకు దారితీస్తుందో ... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top