Translate

  • Latest News

    27, అక్టోబర్ 2017, శుక్రవారం

    అధికారం కోసం వైకాపా వ్యూహాత్మక అడుగులు



    రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైకాపా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది .రాష్ట్రస్థాయిలో కన్వీనర్లు, ముఖ్య నాయకుల సమావేశంలో పాదయాత్ర, రూట్ మ్యాప్, అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ, పార్టీలో సంస్థాగత మార్పులు తదితర అంశాలు చర్చించారు. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కనుసన్నల్లో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందే చెప్పకున్నట్లు ఈసారి అసెంబ్లీ సమావేశాలను వైకాపా బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది 
     పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని, పార్టీ ఫిరాయించిన నలుగురు మంత్రులను తొలగించాలని కోరుతూ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైకాపా పేర్కొంది. ఊహించినట్లే టీడీపీ ఎదురు దాడి ప్రారంభించింది. గతం కన్నా ప్రస్తుతం వైకాపాలో దూకుడు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం చేపట్టాలన్న అకాంక్షతో పార్టీ అధినేత జగన్ ముందుకు సాగుతున్నారు. పాదయాత్ర జరిగే క్రమంలోనూ పార్టీ కన్వీనర్లకు బాధ్యతలు అప్పగించారు. ఏ రోజు వారు ఖాళీగా ఉండకుండా ప్రజల మధ్య ఉండే విధంగా విధంగా ప్రణాళిక రూపోందించారు. పనిలో పనిగా పనిచేసేవారికే పదవులు, పార్టీ టికేట్లు అన్న సంకేతాన్ని పంపించారు. పార్టీ వ్యవస్థాగత మార్పుల్లో భాగంగా నాయకులను దగ్గర చేసేందుకు మూడెంచల వ్యవస్థను రూపొందించారు. నియోజకవర్గ కన్వీనర్లు, పార్లమెంటరీ ఇన్చారులు, రెండు జిల్లాలకు కలిపి ఒక ఇన్ చార్జి అన్న విధంగా పదవులు ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవైపు జగన్ పాదయాత్ర కొనసాగుతుండగానే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. చంద్రబాబునాయుడు రాజకీయ చతురత ముందు జగన్ పాదయాత్ర .ప్రభావం  ఎలా పనిచేస్తుందో  వేచి చూడాలి.

    మానవేంద్ర 


    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: అధికారం కోసం వైకాపా వ్యూహాత్మక అడుగులు Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top