సరిగ్గా వందేళ్ల క్రితం ఇదే రోజు మన దేశంలో ఆమె పుట్టింది. ఆ తర్వాత కాలంలో ఆమె లేని ఇండియాను వూహించలేని స్థాయికి చేరింది. ఆమె పేరు ఇందిరా ప్రియదర్శిని. అదే నండి ... ఇందిరా గాంధీ. ఇందిర మన దేశ పేద ప్రజల గుండెల్లో సదా చిరంజీవి. దేశంలో అట్టడుగు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన మొట్టమొదటి ప్రధాన మంత్రి ఆమె. ఎంత ప్రధాన మంత్రి కూతురైనా ఒక మహిళను దేశ అత్యున్నత పదవిలో చూడడానికి పురుషాధిక్య ప్రపంచం... అదే కాంగ్రెస్ లో ఉన్న ఆనాటి ప్రముఖ నాయకులైన మొరార్జీ దేశాయ్, నిజలింగప్ప, సంజీవ రెడ్డి, అతుల్య ఘోష్ లాంటి నాయకులు అంగీకరించలేదు. కాంగ్రెస్ లో అలాంటి నాయకులను ఎదుర్కొని తన సొంత వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడానికి, తన ప్రత్యేకతను చాటుకోవడానికి పడ్డ తపన లోంచే ఆమె రాజ భరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ లాంటి నిర్ణయాలు తీసుకుంది. గరీబీ హటావో నినాదంతో పేదల మనిషిగా వారి గుండెల్లో శాశ్వతంగా చోటు సంపాదించుకుంది. బాంగ్లాదేశ్ యుద్ధంలో విజేత ఆయన తర్వాత ఉక్కు మనిషిగా, ఇండియాలో తిరుగులేని రాజకీయ వేత్తగా పేరు సంపాదించుకుంది. అయితే మూడేళ్ళలోనే అంతా తిరగబడింది. ఎమర్జెన్సీ తో ఆమె ఒక్కసారిగా దేవత అల్లా దెయ్యం అయిపోయారు. దేవతా... ఆమే ... దెయ్యమూ ...ఆమే ... చివరకు ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్ణయంతో సిక్కులకు శత్రువై అంగరక్షకుల చేతిలోనే హత్యకు గురైయింది. దేశ సమైక్యత కోసం తన ప్రాణాలను అర్పించింది. ఎవరేమనుకున్నా... మన దేశ పేద ప్రజల గుండెల్లో ఇందిర సదా చిరంజీవి.
-మానవేంద్ర
-మానవేంద్ర
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి