గౌరీ లంకేశ్ రచనల సంకలనం తెలుగు అనువాదం కొలిమి రవ్వలు పుస్తక ఆవిష్కరణ సభలో మాట్లాడిన సినీ నటుడు ప్రకాష్ తన నిజాయితి, నిబద్ధతతో కూడిన ప్రసంగంతో నిజంగానే సమాజ కొలిమిలో నిప్పు రవ్వలు రాజేసాడు. ఇన్నాళ్లు మాట్లాడినందుకు సిగ్గు పడుతున్నా... ఇక మాట్లాడకుండా ఉండలేను... నిశ్శబ్దం ఈ సమాజానికి పట్టిన పెద్ద జబ్బు అని, దాన్ని వదిలించుకుని ప్రతి ఒక్కరు మార్పుకు నాంది పలకాలని ఇచ్చిన పిలుపు ఎందరో మేదావుల హృదయాల్లో నిప్పు రవ్వలు రాజేసింది. ప్రకాష్ రాజ్ ను చూసి మనమంతా సిగ్గుపడదాం. పశ్చాత్తాపం పడదాం. గౌరీ లంకేష్ జీవించి ఉన్నపుడు కన్నా..ఇప్పుడు ఆమె మరణం తర్వాతే ఆమె నుంచి ఎక్కువ నేర్చున్నానని ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సో... ప్రకాష్ రాజ్ ను చూసి అయినా మరి మనం బుద్ధి తెచ్చుకుండాం...
-ఎడిటోరియల్ డెస్క్
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి