పడ్డవాడు... ఎప్పుడూ చెడ్డవాడు కాదు అన్న సామెత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి అన్వయించుకోవచ్చు. 2014 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలైన ఆ పార్టీ ఇక ఇప్పట్లో కోలుకునేలా లేదని అందరూ అనుకున్నారు. కానీ మోడీ స్వయంకృతాపరాధాలు మళ్లి కాంగ్రెస్ కు ఊపిరి పోస్తున్నాయి. డిసెంబర్ లో గుజరాత్ లో జరగనున్న ఎన్నికల్లో మోడీ కి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు రాహుల్ గాంధీ. గుజరాత్ లో మోడీ కి వ్యతిరేక వర్గాలన్నిటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు బి.జె.పీ ఎం.ఎల్.ఏ, రాహుల్ గాంధీ కి వరుసకు సోదరుడు అయిన వరుణ్ గాంధీ కాంగ్రెస్ లో చేరుతాడని వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర వహించారని తెలుస్తోంది. ఇదే జరిగితే కాంగ్రెస్ కు నిజంగా శుభసూచకమే. అవసాన దశలో ఉన్న కాంగ్రెస్ ను బతికించడానికి గాంధీ ఫ్యామిలీ అంతా ఒక్కటైతే బెటరే. పైగా కాంగ్రెస్ లో ముసలి జంబూకాలు పోయి అంతా యువ నాయకత్వం రావడం ఆ పార్టీకి శ్రేయోదాయకం. డిసెంబర్ లోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు.
-ఎడిటోరియల్ డెస్క్
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి