సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజని కాంత్ మరోసారి తన అభిమానులను నిరాశపర్చారు. డిసెంబర్ 12 ఆయన పుట్టిన రోజు నాడు చెన్నయ్ లో లేకుండా, అభిమానులకు అందకుండా వెళ్లిపోయారు. ఆయన ఉంటారని, రాజకీయ ప్రవేశం;వై ఈ సారైనా ఏదో ఒక ప్రకటన చేస్తారని కొండంత ఆశతో ఎదురుచూస్తున్న అభిమానులు నిరుత్సాహంతో వెనుతిరిగారు. మరోవైపు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నా అని ప్రకటించిన కమల్ హాసన్ ప్రస్తుతం తన అసంపూర్తి సినిమాలు శబాష్ నాయుడు, విశ్వరూపం-2 సినిమాలు పూర్తిచేసే పనిలో బిజీగా ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు 2016 లోనే జరిగాయి. కాబట్టి మళ్ళీ ఎన్నికలు 2021 లోనే.. ఈ లోపు మూడేళ్లు సమయముంది. కమల్ హాసన్ అందుకే తన సినిమాలు వేగంగా పూర్తిచేసుకుని ఆ తర్వాత రాష్ట్ర పర్యటన చేయాలని తలపెట్టాడు. గత ఎన్నికల్లో డి,ఎం.కె. కు అన్న డి.ఎం.కె కు మధ్య ఓట్ల తేడా కేవలం ఒక్క శాతం మాత్రమే. సీట్లు మాత్రం అన్నా డి.ఎం.కె. కు 136 రాగా, డి.ఎం.కె కు 96 వచ్చాయి. ఈసారి జయలలిత మరణం,,, అన్నా డి.ఎం.కె ముక్క చెక్కలైన పరిస్థితుల్లో డి.ఎం.కె గెలుపుపై పూర్తి ధీమాతో ఉంది. కమల్ హాసన్ అంటి బి.జె,పీ రాజకేయం కుడా డి.ఎం.కె కు ప్లస్ అవుతుంది. సరే... 2021 లోపు తమిళనాడు రాజకీయ తెరపై ఇంకెంతమంది కొత్త తారలు తళుక్కుమంటారో వేచి చూడాలి.
-ఎడిటోరియల్ డెస్క్
-ఎడిటోరియల్ డెస్క్
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి