ప్రతి విషయాన్ని కేంద్రం పై నెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది తమ పరిధి లోది కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు, కాపు రిజర్వేషన్ల అంశం, ఫాతిమా కళాశాల విద్యార్ధుల వివాదం.. ఇవన్నీ కూడా ఇప్పుడు ఢిల్లీ వైపు మళ్లాయి. అంటే.. బంతి కేంద్రం కోర్టులో ఉంది . కేంద్రం వివిధ కారణాలతో స్పందించకుంటే తమ తప్పేమీ లేదని అంతా కేంద్రానిదే అని చెప్పటానికి పన్నాగం పన్నారు. అవకాశం వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. వచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా తనకు అనుకూలంగా మలచుకోవడం, ప్రత్యర్ధులపై పైచేయి సాధించడం అనేది తెలివిగల రాజకీయ నాయకుల లక్షణం. చంద్రబాబు ఇప్పుడు అదే చేస్తున్నారు మిత్రపక్షముగా ఉన్న కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు బెడిసికొడుతున్న సమయంలో, కేంద్రాన్ని బూచిగా చూపి తాను చేసిన హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం లో భాగం లోనే చంద్రబాబు వ్యవహరిస్తున్నట్లు భావిస్తున్నారు.
23, డిసెంబర్ 2017, శనివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి