వేల ఏళ్ల కిందట ఈ నేలపై విషం చిమ్మిన వేయి పడగల హైందవ నాగరాజు ఇప్పుడు మళ్ళి లేచి బుసలు కొడుతోంది. మారుతున్న కాలంతో పాటు ప్రజల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మన ధర్మాలు, శాస్త్రాలు మారాయి. ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రాచరికం పోయి ప్రజాస్వామ్యం వచ్చింది. దేశంలో పౌరులందరికీ సమాన హక్కులు వచ్చాయి. విభిన్న మతాలూ, కులాలు, తెగలు ఉన్న మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించిన ఆదర్శ దేశం మనది. అటువంటి మన దేశంలో ఇన్నాళ్లూ మన్ను తిన్న పాములా కిమ్మనకుండా ఉన్న హైందవ నాగరాజు ఇప్పుడు లేచి బుసలు కొడుతోంది. దీనికి కారణం 2014 లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మనువాద అనుకూల ప్రభుత్వమే.
ఆర్.ఎస్.ఎస్ భావజాలాన్ని నరనరానా జీర్ణించుకున్న వ్యక్తులు ఇప్పుడు మనల్ని ఏలుతున్నారు. వాళ్ళు పైకి ఎన్ని మాయమాటలు చెప్పినా వారి వందిమాగధులు అప్పుడప్పుడూ తమ మనసులో మాటను ఉండబట్టలేక బయటకు వెళ్లగక్కుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే వ్యాఖ్యలు దేశ పౌరుల్లో తీవ్ర ఆందోళనను కలిగించేవిగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని మార్చడానికే మేము వచ్చాం. అని అన్నారు... అక్కడితో ఆగలేదు... లౌకికవాదులు అంటే అమ్మా నాన్నలు ఎవరో తెలియని వారితో సమానం అని కూడా నోరు పారేసుకున్నారు. తమ కులం, తమ మతం చెప్పుకోగలిగిన వారే గొప్పవాళ్ళంట. ఎవరైనా సెక్యూలరిస్టు ను అని చెప్పుకుంటే వారిని అనుమానంగా చూస్తారట....ప్రధాన మంత్రిగా ఉన్న మోడీ వీరి వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం వారిని సమర్ధించినట్టే మిగతా పౌర సమాజం భావించాల్సి వస్తుంది. గతంలో మరో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీని పాలించాలసింది రాముడి సంతానమా... అక్రమ సంతానమా తేల్చుకోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలకు ఇవి కొనసాగింపు మాత్రమే... భవిషత్తులో మరిన్ని పడగలు లేచి బుసలు కొడతాయి... తస్మాత్ జాగ్రత్త...
ఆర్.ఎస్.ఎస్ భావజాలాన్ని నరనరానా జీర్ణించుకున్న వ్యక్తులు ఇప్పుడు మనల్ని ఏలుతున్నారు. వాళ్ళు పైకి ఎన్ని మాయమాటలు చెప్పినా వారి వందిమాగధులు అప్పుడప్పుడూ తమ మనసులో మాటను ఉండబట్టలేక బయటకు వెళ్లగక్కుతున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అనంత కుమార్ హెగ్డే వ్యాఖ్యలు దేశ పౌరుల్లో తీవ్ర ఆందోళనను కలిగించేవిగా ఉన్నాయి. రాజ్యాంగాన్ని మార్చడానికే మేము వచ్చాం. అని అన్నారు... అక్కడితో ఆగలేదు... లౌకికవాదులు అంటే అమ్మా నాన్నలు ఎవరో తెలియని వారితో సమానం అని కూడా నోరు పారేసుకున్నారు. తమ కులం, తమ మతం చెప్పుకోగలిగిన వారే గొప్పవాళ్ళంట. ఎవరైనా సెక్యూలరిస్టు ను అని చెప్పుకుంటే వారిని అనుమానంగా చూస్తారట....ప్రధాన మంత్రిగా ఉన్న మోడీ వీరి వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉండడం వారిని సమర్ధించినట్టే మిగతా పౌర సమాజం భావించాల్సి వస్తుంది. గతంలో మరో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఢిల్లీని పాలించాలసింది రాముడి సంతానమా... అక్రమ సంతానమా తేల్చుకోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలకు ఇవి కొనసాగింపు మాత్రమే... భవిషత్తులో మరిన్ని పడగలు లేచి బుసలు కొడతాయి... తస్మాత్ జాగ్రత్త...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి