2018 లోకి అడుగు పెట్టాం... కాదు.. ఎన్నికల నామ సంవత్సరంలో అడుగుపెట్టాం. ప్రతిపక్ష నాయకుడు ఆల్రెడీ పాదయాత్ర పేరుతొ ప్రజల్లోనే ఉన్నారు. పాలక పార్టీ నాయకులు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జనంలోకి వెళుతున్నారు. దాని సంగతలా ఉంచితే రెండు పార్టీల్లోనూ ఎం.ఎల్.ఏ అభ్యర్థులకు గుండెల్లో గుబులు మొదలయింది. ఈసారి టికెట్ వస్తుందో రాదోనని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సర్వేలు చేయంచుకుని ఎం.ఎల్.ఏ లకు రేటింగులు పెట్టి. . మార్కులు వేస్తున్నారు...ఈ సారి సగం మందికి టిక్కెట్లు హుళక్కి అని వార్తలు వస్తున్నాయి. దాంతో తమకు పాస్ మార్కులు పడతాయో లేదోనని తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ ఎం.ఎల్.ఏ లలో ఆందోళన మొదలయింది. ఇక వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా అదే టెన్షన్... ఈ సారి ఎన్నికలు పార్టీకి చావో...రేవో... తేల్చుకునే ఎన్నికలు కాబట్టి... పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహనరెడ్డి గతంలో లాగా పంతాలు...పట్టింపులకు పోకుండా... ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఇన్నాళ్లూ పార్టీ కోసం ఒళ్ళు, ఇళ్లు గుల్ల చేసుకుని తిరిగినా టికెట్ రాకపోతే ఏమిటి పరిస్థితి అని ఆ పార్టీ నాయకుల్లో ఆందోళన మొదలయింది. ఎన్నికల ప్రకటన వచ్చాక టిక్కెట్లు రాని వాళ్ళు అటు నుంచి ఇటు... ఇటు నుంచి అటు ఎన్నెన్ని జంపింగులు చేస్తారో మనం తమాషా చూడవచ్చు.
6, జనవరి 2018, శనివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి