నాలుగేళ్ల కిందట తిరుగులేని మెజారిటీతో ఢిల్లీ పీఠం అధిష్టించిన బీజేపీ ప్రాభవం క్రమేణా తగ్గుతోందా... అవుననే అనిపిస్తోంది. బీజేపీ కి అత్యంత బలమైన రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్ ల్లో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే ఆ అనుమానం రాక మానదు.
గుజరాత్ సాధారణ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గెలిచిన బీజేపీ ఎలాగోలా గెలిచాం అని జబ్బలు చరుచుకున్నా... రెండు రోజుల కిందట రాజస్థాన్ ఉప ఎన్నికల ఫలితాల్లో మొత్తం జరిగిన రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ సీట్లలో కూడా చిత్తుగా ఓడిపోయింది. ఈ మూడింటిని కాంగ్రెస్ గెలుచుకోవడం గమనార్హం. పైగా లక్షల్లో మెజార్టీలు ...ఒక స్థానంలో అయితే కాంగ్రెస్ కు 2 లక్షల మెజార్టీ వచ్చింది. ఇంత భారీ తేడాతో బీజీపీ అభ్యర్థులను ఓడించారంటే ఎంత వ్యతిరేకత ఉందొ అర్ధం అవుతోంది.
బీజీపీ కి బలమైన రాష్ట్రాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక మిగతా రాష్ట్రాల్లో బీజీపీ కి ఎంత వ్యతిరేకత ఉంటుందో అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ బీజీపీతో తెగతెంపులు చేసుకున్నా చేసుకోవచ్చు. పవన్తో జత కట్టి ఎన్నికల పోరులో ముందుకెళ్లే అవకాశం ప్రస్ఫుటంగా ఉంది. బీజీపీ ఎన్ని ఎత్తులు వేసినా దక్షిణాది రాష్ట్రాల్లో దాని పప్పులు ఉడకవు. ఏదేమైనా వచ్చే ఎన్నికలు అత్యంత ఆసక్తిదాయకంగా ఉండే అవకాశం ఉంది.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి