Translate

  • Latest News

    2, మార్చి 2018, శుక్రవారం

    కుదరని సంధి...కిమ్..కర్తవ్యం..?



    మిత్రపక్షాలైన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజే పీ కి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి సంధి కోసం సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రయత్నీమ్చినా ఒక కొలిక్కి రాలేదు. గురువారం బీజే పీ అధ్యక్షుడు అమిత్ షా తో టీడీపీ ఎం.పీ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు  కుటుంబరావు జరిపిన చర్చలు ఫలవంతం కాలేదు. వీరు రాష్ట్రానికి రావాలని అడుగుతున్న సాయానికి సంబంధించి ఒక నివేదికను ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఈ లెక్కలపై కేంద్రానికి, రాష్ట్రానికి ఏకాభిప్రాయం కుదరడం లేదు. గత పార్లమెంట్ సమావేశాల్లో అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన తర్వాత కూడా టీడీపీ రుసరుసలు ఏమిటని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.టీడీపీ వారు అడుగుతున్నదానిపై అమిత్ షా ప్రతిస్పందిస్తున్న తీరు చూస్తుంటే ఇరువర్గాల మధ్య సయోధ్య అంత తేలిగ్గా కుదిరేటట్టు లేదు.  ఈ నేపథ్యంలో ఈ నెల 5 వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో  తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై  నిర్ణయించేందుకు ఈ రోజు అమరావతిలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. మరి టీడీపీ పోరు బాట పడుతుందా... మౌన ముద్ర పడుతుందా అనేది వేచి చూడాలి. 
    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: కుదరని సంధి...కిమ్..కర్తవ్యం..? Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top