Translate

  • Latest News

    27, మార్చి 2018, మంగళవారం

    తెలుగువారి పరువు గంగలో కలపటానికి ఢిల్లీదాక వెళ్లాలా...


     తెలుగువారి పౌరుషాన్ని దిశదశల చాటి చెప్పే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక అంశంపై ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఒక తాటిపై నిలబడకపోయినా ఒక్క అంశంపై పోరాడుతున్నందుకు సంతోషించాం. ప్రత్యేకహోదా అంశం జాతీయ స్థాయిలో చర్చకు దారితీయటం , అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఈ అంశంపై మద్దతు పలుకుతున్నందుకు తెలుగువాడి ప్రతాపం ఇదని మీసాలు మెలివేశాం. మననేత చంద్రబాబునాయుడు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతున్నందుకు, మరోనేత జగన్ ప్రత్యేక హోదాపై అలుపెరుగని పోరాటం చేస్తున్నందుకు, జనసేనాని పవన్ ఎడమొహం పెడమొహంగా ఉండే ఎర్రపార్టీలను చేరోవైపు కూర్చోబెట్టుకొని పావులు కదుపుతున్నందుకు ఆనందించాం..
     అరే ఆనందం ..ఆ సంతోషం... ఆ అనుభూతి కొన్ని రోజులుకూడా తెలుగువారి కి దక్కకుండా చేసారు. దేశరాజధాని సాక్షిగా టీడీపీ ,వైకాపా పార్టీ లు తెలుగువారి కీర్తిని మరోవిధంగా ముందుకు తీసుకువెళ్లాయి. నీవు బ్యాంకులను దివాలా తీయించిన విజయ్ మాల్య అని ఒకరంటే ,నీ నాయకుడు చార్లెస్ శోభరాజ్  మించిన గజదొంగ అంటూ దుమ్మత్తి పోసుకున్నాయి. మరోవైపు నీవు ప్రధాని కాళ్ల పట్టుకున్నావని ఒకరంటే , కాదు నీవే కాళ్లు పట్టుకున్నావని మరోకరు చెలరేగిపోయారు. ఇలా తెలుగుపార్టీల నేతలు సిగపట్టు పడుతున్న సమయంలో ఓ పెద్దమనిషి తెల్లటి మీసాల మాటున వ్యంగపు నవ్వు కనిపించలేదా.. కొట్టుకోవటానికి .... తెలుగువారు పరువు గంగలో కలపటానికి ఢిల్లీదాక వెళ్లాలా.. అదేదో అమరావతి గల్లీల్లో అయితే కొంతబెటరేమో...  ఏ ప్రస్థానానికి ఈ పరిణామం ...

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    Item Reviewed: తెలుగువారి పరువు గంగలో కలపటానికి ఢిల్లీదాక వెళ్లాలా... Rating: 5 Reviewed By: Bhinna Swaram
    Scroll to Top