ప్రత్యేక హోదా ఉద్యమం ఎక్కడ జగన్ చేతుల్లోకి వెళ్లిపోతుందేమోనన్న భయంతో హడావుడిగా రాత్రికి రాత్రి ప్లేట్ ఫిరాయించి... అవిశ్వాస తీర్మానం నేనే పెడతానని ముందుకొచ్చిన చంద్రబాబు ఆ తర్వాత జపాన్ విధానం అంటూ.. నల్ల బాడ్జీలతో నిరసన తెలుపుతామంటూ... గాంధేయ వాదమంటూ... ఏవేవో కబుర్లు చెబుతూ సాధ్యమైనంత వరకు హోదా ఉద్యమాన్ని నీరు కార్చడానికి తన వంతు కృషి శాయశక్తులా చేస్తున్నాడు. మరో వైపు పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 6 తర్వాత కార్యాచరణ అంటూ... అప్పటిదాకా మళ్ళీ అజ్ఞాత వాసం లోకి వెళ్ళిపోయాడు. సమ్మర్ లో ఆమరణ దీక్షకు కూర్చుని క్రెడిట్ అంతా తన ఖాతా లోకి వేసుకుందామని పవన్ కళ్యాణ్ ప్లాన్... వీరిద్దరి ప్లాన్ లను పటాపంచలు చేస్తూ జగన్ శనివారం పాదయాత్రలో సంచలనాత్మకమైన ప్రకటన చేశాడు. ఏప్రిల్ 6 తమ పార్టీ ఎం.పీ లు రాజీనామా చేయడంతో పాటు అదే రోజు ఆమరణ దీక్షలకు కూరుచుంటారని ప్రకటించారు. వాస్తవానికి వై.సి.పీ కి ఉన్నది ఐదుగురు ఎం.పీ లే. తెలుగుదేశంకు 18 మంది ఎం.పీ లు ఉన్నారు. చిత్తశుద్ధి ఉండాలే గాని ఐదుగురు ఎం.పీ లతో అయినా ప్రకంపనలు సృష్టించవచ్చని జగన్ నిరూపిస్తున్నాడు. వెల్డన్ జగన్...
1, ఏప్రిల్ 2018, ఆదివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి