ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం రూ. 2 వేల కోట్ల విలువ చేసే బాండ్లు ఈ నెలాఖరు కల్లా జారీ చేసి, మార్కెట్లో విడుదల చేయాలని సి.ఆర్.డి.ఏ నిర్ణయించింది. ఈ బాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందట. రాజధాని వ్యవహారాలపై శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సి.ఆర్.డి.ఏ కమిషనర్ శ్రీధర్, అమరావతి డెవలప్ మెంట్ కమిటీ అధికారులతో సమావేశాలు తీసుకున్నారు. ప్రాధమికంగా రూ. 2 వేల కోట్లకు బాండ్లు విడుదల చేయనున్నట్టు సి.ఆర్.డి.ఏ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. అయితే ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేకంగా బాండ్లు విడుదల చేయాలని సి.ఎం ఆయనకు సూచించారు. ఈ నెల 22 నాటికి వీటికి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ ప్రక్రియ పూర్తవుతుందని, ఈ బాండ్లకు ఏ. ఏ ప్లస్, ఏ ఏ కేటగిరి లలో క్రెడిట్ రేటింగ్ వచ్చే అవకాశం ఉందని సి.ఆర్.డి.ఏ కమిషనర్ తెలిపారు. రాజధానిలో వివిధ ప్రాజెక్టులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపునకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు.
ఓ.కే... అంతా బాగానే ఉంది. కానీ ఓ చిన్న మాట బాండ్లు విడుదల చేసే ముందు ఈ నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం కోసం... ఎవరెవరు... ఎంతెంత విరాళాలు ఇచ్చారు... వాటిని వేటికి వేటికి ఖర్చు పెట్టారు.... టీ డీ.పీ తోక పత్రిక ఆంధ్ర జ్యోతి పాఠకుల నుంచి రాజధాని విరాళాలు పేరుతొ ఎంత కలెక్ట్ చేసింది... ఆ విరాళాలు ఎవరికి అప్పచెప్పింది... వగైరా... మొత్తం శ్వేతపత్రం విడుదల చేసి తన నిజాయితీ నిరూపించుకోవాలి. మార్కెట్ లోకి వస్తున్నప్పుడు ఏ కంపెనీకి అయినా.. సంస్థ కి అయినా విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం కదా సారూ..
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి