అక్కడ స్విచ్ వేస్తె ఇక్కడ లైట్ వెలుగుతుంది... రాష్ట్రంలో గత కొంతకాలంగా జరుగుతున్నదిదే... రాష్ట్ర ప్రజలకు ఈ విషయం బాగా అర్దమయింది. అందుకే వాళ్ళు అక్కడకు వెళ్లి స్విచ్ నొక్కి వస్తున్నారు... వాళ్ళు ఇలా వచ్చీ రాగానే ఇక్కడ లైట్ వెలుగుతోంది. ప్రజల ఆనందం అంతా...ఇంతా కాదు...
ఏదేమైనా ప్రజలు బాగా తెలివిగల వాళ్ళు... వాళ్ళు ఎప్పుడు...ఎవరిని పైకెత్తాలో ...ఎప్పుడు ఎవరిని పడదోయాలో బాగా తెలుసు. రాజకీయ నాయకులు అనుకుంటారు... ప్రజలు వెర్రివాళ్ళు... ఎన్నికలప్పుడు ఓటుకు నోటు, మద్యం ఇస్తే చాలు... గెలిచేయవచ్చు అని... కానీ అది నిజం కాదు... ప్రస్తుతం సమాజంలో వివిధ వర్గాలవారు అనేకానేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. వీరు తమ సమస్యలు పరిష్కారం కావాలంటే... ఒక సులువు మార్గం ఎన్నుకున్నారు. పాదయాత్రలో ఉన్న జగన్ ను కలసి ఆయనకు తమ గోడు చెప్పుకుని, ఒక వినతి పత్రం ఇచ్చి వస్తున్నారు... వెంటనే ఆయన ఆవేశంగా వారికి వరాలు ప్రకటించేస్తున్నారు... అక్కడ ఆయన ప్రకటించగానే సాయంత్రానికి ఇక్కడ సి.ఎం పేషీ నుంచి ప్రెస్ కి ఒక పత్రికా ప్రకటన విడుదల అవుతుంది. ఆయా రంగ సమస్యలకు సంబంధించి సి.ఎం కొన్ని పరిష్కారాలు అప్పటికప్పుడు ప్రకటిస్తారు. ఈ విషయం కనిపెట్టిన ప్రజలు ఇక ఒక్కొక్కరూ తమ తమ సమస్యలు చెప్పుకోవడానికి పాదయాత్రలో జగన్ వద్దకు క్యూ కడుతున్నారు. అయితే వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక విషయం గ్రహించాలి. వీరంతా జగన్ కు ఓటు వేస్తారని గ్యారంటీ ఏమీ లేదు. ముందే చెప్పాను కదా ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు అని... ఇక జగన్ ప్రకటించిన నవరత్నాలు సంగతి కి వస్తే... అందులో ప్రకటించిన వాటికి కాస్త అటు..ఇటుగా చంద్రబాబు కూడా ఎన్నికల ముందు ప్రకటిస్తారు... మళ్ళీ నన్ను గెలిపిస్తే అవన్నీ చేస్తానంటారు... ముందుగా కొన్ని శాంపిల్ గా వదులుతారు.. అప్పుడు ప్రజలు మళ్ళీ ఆయన మాటల్ని నమ్ముతారో... లేదో ఈ సారి జగన్ వైపు మొగ్గుతారో అనేది వేచి చూడాలి.
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి