ప్రత్యేక హోదా విషయంలో పార్లమెంట్లో ఇంతకూ సెల్ఫ్ గోల్ ఎవరు అయినట్టు...? జగన్ తొందరపడి తన ఎం.పీ లతో రాజీనామా చేయించి, తీరా అవిశ్వాసం పార్లమెంట్ లో చర్చకు వచ్చే సమయానికి సభలో లేకుండా పోయి సెల్ఫ్ గోల్ అయ్యాడని తెలుగుదేశం వారితో పాటు కొంతమంది రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. నిజమే వై.ఎస్.ఆర్.సి.పీ సెల్ఫ్ గోల్ అయిందనుకోండి. మరి... అంత హడావిడి చేసి అవిశ్వాసం పెట్టిన టి.డి.పీ ఏమి సాధించినట్టు. చర్చల్లో పాల్గొంటూ ప్రధానమంత్రి మోడీ... చంద్రబాబే హోదా వద్దన్నాడు... ప్యాకేజీ కావాలి అని అన్నాడు అంటూ చట్ట సభ సాక్షిగా నొక్కి మరీ చెప్పాడు. బి.జె.పీ తన సెల్ఫ్ డిఫైన్స్ కోసం మిత్రుడైన చంద్రబాబు ను సెల్ఫ్ గోల్ చేసింది. ప్రతిపక్షాలు బయట ఎన్ని ఆరోపణలు చేసినా, పత్రికలలో ఎన్ని రాతలు రాసినా అది వేరు. స్వయంగా ప్రధాన మంత్రి... అదీ లోక్ సభ లో...చెప్పింది రికార్డెడ్... పైగా నిన్న అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఎవరు ఏమి చెబుతారా అని కోట్లాదిమంది తెలుగువారు చెవులు రిక్కించి మరీ వింటుండగా... ప్రధానమంత్రి మోడీ ఈ మాటలు చెప్పడంతో చివరకు చంద్రబాబే సెల్ఫ్ గోల్ అయినట్టయింది. దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే ఈ రోజు నిరసనల ప్రోగ్రామ్ పెట్టించాడు. చంద్రబాబు హోదా ఉద్యమాన్ని హైజాక్ చేయాలని ఎంత ప్రయత్నీమ్చినా ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. పాపం...చంద్రబాబు...
21, జులై 2018, శనివారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి