పైత్యం పరాకాష్టకు చేరితే ఇలాగే ఉంటుంది... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మన అవసరాలకు తగిన విధంగా వాడుకోవచ్చు కానీ, దాంతో పరాచికాలాడి...లేని పోని ప్రయోగాలు చేస్తే అసలుకే ఎసరు వస్తుందనడానికి ఈ ఉదంతమే ఉదాహరణ. ఇటీవల స్మార్ట్ ఫోన్లతో ప్రమాదకర ప్రదేశాల్లో సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. తమిళనాడు కు చెందిన ఓ యువకుడు మరో అడుగు ముందుకు వేసాడు. తిరుప్పూర్ జిల్లా పుడుపాలయం కు చెందిన కార్తికేయన్ (34) కృతిక (28) దంపతులు. ఇద్దరు ప్రైవేట్ ఉద్యోగస్తులు. వీరికి డిమాని అనే మూడేళ్ళ కుమార్తె ఉంది. కృతిక మళ్ళీ గర్భం దాల్చింది. ఈ నెల 22 న పురిటి నెప్పులు వచ్చాయి. పైత్యం పతాక స్థాయికి చేరిన కార్తికేయన్ . తన భార్యకు ప్రసవం డాక్టర్లతో చేయించకుండా యూ ట్యూబ్ లో పురుడు ఎలా పోయాలో చూస్తూ తన స్నేహితులైన ఇద్దరు దంపతులతో ప్రసవం చేయించాడు. మూడున్నర కేజీల శిశువును ప్రసవించిన ఆ మహిళ విపరీతంగా రక్తస్రావమై మరణించింది. ఇప్పుడు ఆ భర్త గారు పోలీసుల అదుపులో ఉన్నాడు. యూ ట్యూబ్ లో చూస్తూ ప్రసవం చేసిన ఆ దంపతులు పరారీలో ఉన్నారు. డాక్టర్ల తో ప్రసవం చేయించామని ఎంత మొత్తుకున్నా అల్లుడు వినలేదని, అన్యాయంగా నా కూతురు ప్రాణం పొట్టన పెట్టుకున్నాడని పాపం అత్తగారు రోదిస్తోంది. పైత్యం పరాకాష్టకు చేరితే... ఇలాగే ఉంటుంది మరి...
27, జులై 2018, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి