ఇండియా టుడే నేషనల్ ఛానల్ సర్వే మూడు రోజుల క్రితం విడుదల చేసిన సర్వే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆ ఛానల్ గత సెప్టెంబర్లో చేసిన సర్వేలో జగన్ కు 43 శాతం, చంద్రబాబుకు 38 శాతం ఓటర్లు అనుకూలంగా ఉన్నారని ప్రజాభిప్రాయం వచ్చినట్టుగా చెప్పగా, తాజాగా ఫిబ్రవరిలో మళ్ళీ చేసిన సర్వేలో జగన్ కు 2 శాతం పెరిగి 45 శాతం అయినట్టు, చంద్రబాబుకు 2 శాతం తగ్గి 36 శాతం అయినట్టు వెల్లడించింది. ఇందులో వాస్తవాలు ఎంత అన్నది పక్కన పెడితే ఇండియా టుడే కున్న విశ్వసనీయత దృష్ట్యా ఈ సర్వే రాజకీయ వర్గాలలో పెను సంచలనమే అయింది. బహుశా అందుకే కాబోలు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైకి మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన భయపడుతున్నట్టు ఆయన ప్రకటనలే చెబుతున్నాయి. దానికి నిదర్శనమే ఈ రోజు జగన్ లండన్ పర్యటనపై విమర్శ. ఏడాదికి పైగా పాదయాత్ర చేసి, కుటుంబానికి దూరంగా ఉన్న జగన్... మళ్ళీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే కుదరదు కాబట్టి.. ఈలోగా ఓ సారి లండన్ లో చదువుతున్న కూతురిని చూసొద్దామని భార్య భారతితో కలసి లండన్ వెళితే దానికి కూడా చంద్రబాబు వక్రభాష్యం చెప్పారు. ఎన్నికల ముందు ఎవరైనా విదేశాలకు వెళతారా... వెళ్లారంటే హవాలా డబ్బు పోగేసుకోవడానికే అని విమర్శ చేశారు. దీనికి ఎలాగూ ఎల్లో మీడియా వంత పాడుతుంది.
బాబు గెలుపు పై దేశం ధీమా...
అదేమిటి... చంద్రబాబు డ్వాక్రా మహిళలకు 10 వేలు ఇచ్చాడు. మరి ఫిబ్రవరిలో బాబుకు ఓట్ల శాతం పెరగాలి కదా తగ్గడం ఏమిటి.. ఇదంతా బోగస్ ... చంద్రబాబు గెలుపు ఖాయం అని దేశం వర్గాలు అంటున్నాయి. వాళ్ళు అనే దాంట్లోనూ పాయింట్ ఉందనుకోండి. వాళ్ళ థియరీ ప్రకారం జగన్ కే 2 శాతం తగ్గి 41 శాతం అవుతుంది. దేశం కి 2 శాతం పెరిగి 40 అవుతుంది. ఆ తర్వాత... అంటే ఇండియా టుడే సర్వే తర్వాత చంద్రబాబు రైతుల అకౌంట్లలో వెయ్యి రూపాయలు వేశాడు. ఎన్ని కల లోపు ప్రతి ఒక్క రైతు అకౌంట్లో మరో 14 వేలు వేయనున్నారు. దీనితో చంద్రబాబు గ్రాఫ్ 45 శాతంకు పెరిగి... జగన్ గ్రాఫ్ 35 శాతం కు పడిపోతుందని టి.డి.పీ వర్గాల ప్రగాఢ నమ్మకం. గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు తన రాజకీయ చాణక్యంతో అసలు గెలవాడనుకున్న వాడు గెలిచి కూర్చున్నాడు కదా... అని తెలుగుదేశం వారు నొక్కి వక్కాణిస్తున్నారు. చూద్దాం... మరి ఏం జరుగుతుందో...
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి