బి.జె.పీ తో దోస్తీకి చంద్రబాబు తహతహలాడుతున్నారు... రాష్ట్రంలో జగన్ దెబ్బకు అతలాకుతలమైన తెలుగుదేశం పార్టీపై గోరుచుట్టుపై రోకటి పోటులా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు కట్ట కట్టుకుని కాషాయ కండువాలు కప్పుకోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది... ఈ నేపథ్యంలో చంద్రబాబు పార్టీ మనుగడ కోసం...పార్టీ ఉనికి నిలబెట్టుకోవడం కోసం నానా పాట్లు పడుతున్నారు. నిన్నటి వరకు తనకు కుడి, ఎడమ భుజాలుగా ఉన్న సుజనా చౌదరి, సి.ఎం.రమేష్ లు కమలం గూటికి చేరడంతో రెండు భుజాలు కోల్పోయి అవిటి వాడైన చంద్రబాబుకు ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయాలంటే ఊత కర్రలు కావాలి... ఆ ఊత కర్రల్లో ఒకటి బి.జె.పీ కావాలని బాబు ఉబలాటపడుతున్నారు. (మరో ఊత కర్ర జనసేన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది కదా...) అయితే... అది అనుకున్నంత సులువు కాదు... ఎందుకంటే బి.జె.పీ లో బాబు గారి రెండు భుజాలు ఉన్నా... దారిలో ఈయన్ను రాకుండా అడ్డుకోవడానికి పురందేశ్వరి అనే హర్డిల్ ఉండనే ఉంది.... ఆమె బాబును రానీయకుండా శతవిధాలా ప్రయత్నిస్తుంది... ఆమెకు తోడు నిన్న రాష్ట్రంలో పర్యటించిన బి.జె.పీ జాతీయ కార్యదర్శి, పార్టీ రాష్ట్ర ఇంచార్జి సునీల్ దేవధర్ టి.డి.పీ తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. టి.డి.పీ అవినీతిలో కూరుకుపోయిందని, టి.డి.పీ హయాంలో జరిగిన అవినీతిపై ఎవరైనా ఆధారాలు సమర్పిస్తే చర్యలు తీసుకుంటామని కూడా తేల్చి చెప్పారు. మరో పక్క తెనాలిలో బి.జె.పీ నాయకుడు సోము వీర్రాజు మాట్లాడుతూ మోడీ మెడలు వంచుతానని ప్రగల్బాలు పలికిన చంద్రబాబు... ఇప్పుడు అబ్బే... నాకు మోడీ తో వ్యక్తిగత విభేదాలు ఏమి లేవంటే ఎవరు నమ్ముతారంటూ ప్రశ్నించారు... అయితే... బాబు ఏమైనా చేయగలడని, అందితే జుట్టు... అందకపోతే కాళ్లు అయినా పట్టుకుని తన పని కానిచ్చుకునే కార్యసాధకుడని ఆ పార్టీ నాయకులు తమ అధినాయకుడిపై ప్రగాఢ విశ్వాసంతో ఉన్నారు.
18, అక్టోబర్ 2019, శుక్రవారం
- Blogger Comments
- Facebook Comments
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి