ప్రధాని మోడీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తుంటారు. తన గెలుపుకు,ప్రస్తుత తన ఇమేజికి కారణమైన సోషల్మీడియా, మీడియాను చాల జాగ్రత్తగా మేనేజ్ చేస్తుంటారు. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ విధించే క్రమంలోనే మోడీ ఇలాగే మేనేజ్ చేశారు. గతంలో మన తెలుగు సంపాదకులు, మీడియా యాజమాన్యంతో ప్రధాని మోడి నేరుగా మాట్లాడినప్పుడే అసలు కథమేమిటన్న విషయంపై చర్చకొనసాగింది. ఇలా జరిగిన కొద్దిరోజుల్లో మీడియా,పత్రికల్లో లాక్డౌన్ అనివార్యం అన్నట్లు కథనాలు, చర్చలు కొనసాగటం దశలవారి లాక్డౌన్ ప్రవేశపెట్టడం జరిగిపోయింది.
ఈ లీకుల వెనుక కథ ఇదేనా..?
ఈ లీకుల వెనుక కథ ఇదేనా..?
ప్రజలను సంసిద్దం చేయటానికి అధికార పార్టీలో ఉండే వారు లీకులు రిలీజ్ చేస్తుంటారు. ఇలా చేయటానికి ప్రధాన కారణం ఆ లీకులపై ప్రజల్లో అసంతృప్తి వస్తే మేము అలా ఎప్పుడు చెప్పాం. అది ఆ ఛానల్, పత్రిక సొంత అభిప్రాయం అని చెప్పుకోవచ్చు. అలా కాకుండా ప్రతిపక్షాలు, ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేకపోతే దాన్ని యధావిధిగా అమలు చేయవచ్చు. ఈ వెసులుబాటును వినియోగించుకొని అధికారంలో ఉన్న ప్రభుత్వాలు లీకుల పరంపర కొనసాగిస్తుంటాయి. ఇలాంటి విషయాలకు వస్తే స్పందించటం మానివేసిన ప్రజలు ఒక సంస్కరణ, పథకంపై వ్యతిరేకించిన సందర్బాలు కూడా చాలా తక్కువే.
ఇక అసలు విషయానికి వద్దాం. ప్రస్తుతం లాక్డౌన్ సడలింపులతో కేవలం కంటోన్మెంట్ జోన్లకే పరిమితమైన లాక్డౌన్ కొనసాగుతుంది. లాక్డౌన్ సడలింపులతో వాస్తవంగా కరోనా కేసులు గుణాత్మక స్థాయిలో పెరిగిన విషయం తెలిసింది. ఈ సమయంలో ప్రభుత్వం ఏం చేయాలి. ఎటువంటి అడుగు వేయాలన్న అంశం కీలకంగా ఉంది. మరోవైపు లాక్డౌన్ పొడిగిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటన్న విషయం కూడా అయోమయానికి గురిచేస్తుంది. ఈ క్రమంలోనే గత రెండు, మూడు రోజులుగా పత్రికలు, కొన్ని మీడియాల్లో లాక్డౌన్ సడలింపులతో పెరిగి పోతున్న కరోనా కేసులపై విస్తృతమైన చర్చ కొనసాగుతోంది. మరోవైపు తిరిగి పూర్తి స్థాయి లాక్డౌన్ అమలు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇదంతా దేనికి సంకేతం. ఎలాగూ వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. కాబట్టి పూర్తి స్థాయి లాక్డౌన్ విధించాలన్న డిమాండ్లు చర్చల్లో కొనసాగుతున్నాయి. ఈ చర్చలు కేంద్రం ఇస్తున్న లీకులతో జరుగుతున్నాయా...? పూర్తిస్థాయి లాక్డౌన్ తప్పదా... ?
0 comments:
కామెంట్ను పోస్ట్ చేయండి